• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » నిరుద్యోగుల నిరసనలతో అట్టుడుకుతున్న బీహార్

నిరుద్యోగుల నిరసనలతో అట్టుడుకుతున్న బీహార్

Last Updated: January 26, 2022 at 6:44 pm

బీహార్​లో నిరుద్యోగులు మరోసారి ఆందోళనలను తీవ్రతరం చేశారు. రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ నిరనసలు ఉద్రిక్తతలకు దారితీశాయి. గయా రైల్వేస్టేషన్​ ఆగి ఉన్న ప్యాసింజర్​ రైలుకు నిరసన కారులు నిప్పు అంటించారు. 2019లో RRB-NTPC నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని నోటిఫికేషన్ లో ఉంది.

మొదటి దశ ఎగ్జామ్ అయిపోయి.. జనవరి 15న ఫలితాలు కూడా వచ్చాయి. అయితే, ఈ పరీక్షలలో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. దానికి తోడు.. ఇప్పుడు రెండో దశ పరీక్ష సీబీటీ కంప్యూటర్​ పరీక్ష ఉంటుందని రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు చెబుతోంది. దీంతో నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్నాలో నిరసన కారులు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్​పై చేరుకుని ఆందోళన చేశారు. జెహనాబాద్​లో రైలుపట్టాలపై ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

సీతామర్హి ప్రాంతంలోను ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసన కారుల కారణంగా.. ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే జోన్​లోని సుమారు 30 రైళ్ల రాకపోకలకు ఆటంకం జరిగింది. నలుగురు విద్యార్థులను పట్నా పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిపై స్పందించిన రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్ నోటిఫికేషన్​లోనే రెండో దశ పరీక్ష వివరాలు కూడా స్పష్టంగా తెలిపామని చెబుతుంది..అభ్యర్థుల ఆరోపణలలో నిజం లేదని కొట్టిపారేసింది.

రెండో దశ పరీక్షలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని.. ఈ అల్లర్ల నేపథ్యంలో వాటిని నిలిపివేస్తున్నామని బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళనలను పరిశీలించడానికి రైల్వేశాఖ ఆధ్వర్యంలో హైపవర్​ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అభ్యర్థులు తమ ఈ కమిటికి తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకు సమర్పించవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్​ వేదికగా తెలిపింది.

ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బీజేపీ విధానాలను తాను కూడా వ్యతిరేకిస్తానని అన్నారు. అన్యాయానికి గురి అవుతున్న విద్యార్థులకు తన మద్దతు కూడా ఉంటుందని ట్వీట్ చేశారు. అయితే.. హింసా మార్గాన్ని ఎంచుకోవడం సరికాదని సూచించారు. “విద్యార్థులారా.. దేశానికి, మీ కుటుంబానికి మీరే ఆశాకిరణాలు. ఇలాంటి హింసా మార్గాన్ని వదిలి.. శాంతి యుతంగా మీ నిరసనను తెలియజేయండి” అని ట్వీట్ చేశారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

సినిమాల‌ను త‌ల‌పించే జులూం..!

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

ట్రైన్ జర్నీ చేస్తున్నారా…? ఆ యాప్ ఉండాల్సిందే

భ‌క్తుల‌కు ప్ర‌వ‌చ‌నాలు..!

వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన!

జీతాలివ్వ‌డానికి డ‌బ్బులు లేవు..!

కుడి చేతితో ఇవ్వ‌డం.. ఎడ‌మ చేతితో లాక్కోవ‌డం..!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. ఇక ఎవరికి తెలియదు..!

దశాబ్దం చివరి నాటికి 6జీ సేవలు

ట్విట్టర్ కొనుగోలుకు మస్క్ ఆఫర్..!

జైలు కథ కంచికేనా..? అవినీతిపై చర్యలు.. ఉడుత ఊపులేనా!!

కుదిరితే కేసులు.. లేకుంటే దాడులు..!

ఫిల్మ్ నగర్

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య... పట్టించుకోని శృతిహాసన్?

ఆర్ధిక ఇబ్బందుల్లో కమల్ మాజీ భార్య… పట్టించుకోని శృతిహాసన్?

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

బ్యాట్ తో బాజా.. సినిమాల్లో మ‌జా..!

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

చంటి సినిమా విషయంలో ఆ హీరోకి చిరు అన్యాయం చేశాడా ?

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

ఎన్టీఆర్ కు ఫస్ట్ ప్లేస్.. చరణ్ కు నాలుగో స్థానం

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

సర్కారువారి పాట చూసి సితార రియాక్షన్ ఏంటి?

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

బాలయ్య చేతులమీదుగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

సమంత, విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

ఆర్ఆర్ఆర్ కు రూ.100.. కేజీఎఫ్ 2కు రూ.199

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)