ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని ఈ సమావేశం నిర్వహించనుంది కమిటీ. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని పేర్కొంది. ఏయే అంశాలు చర్చించాలన్న విషయంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలిపింది. షెడ్యూల్ 9, 10లోని.. సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జరుపుతామని తెలిపింది. అలాగే.. ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉండడం గమనార్హం. వనరుల సర్దుబాటు, 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదల అంశం కూడా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా వనరుల సర్దుబాటు, 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధుల విడుదల అంశాలు కూడా చర్చించనున్నట్టు తెలిపింది.
కాగా.. విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.