“ఆహా” ఓటీటీ లో సూపర్ హిట్ టాక్ షో ‘అన్ స్టాపడబుల్’. ఒక సీజన్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెండో సీజన్ లో కూడా అదే జోష్ తో దూసుకుపోతుంది. దీనికి వ్యాఖ్యాత బాలకృష్ణ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయితే, వచ్చే గెస్టులు సెన్సేషన్. ఆ తరహాలోనే ఇటీవల ఈ షోకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ వచ్చారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన తొలి భాగం విడుదలైంది. త్వరలోనే రెండో భాగాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది ఆహా. ఈ ప్రోమోలో బాలకృష్ణ, పవన్ మధ్య జరిగిన సరదా సంభాషణలను చూపించారు.
తెలుగుదేశంలో చేరొచ్చు కదా? కొత్త పార్టీ ఎందుకు? అని పవన్ను ప్రశ్నించారు బాలయ్య. “సినిమాలను పూర్తిగా వదిలేసి.. రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేస్తారు” అని అడిగారు. వాటితోపాటు పవన్ను బాలయ్య పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.
బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్గా ఆహా ఎప్పటి నుంచో ఈ ఎపిసోడ్ను ప్రచారం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే అన్స్టాపబుల్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఒకటో భాగం సూపర్ హిట్ అయ్యింది. పలు రికార్డులు బద్దలుగొట్టిందని తెలుస్తోంది. కాగా, మొదటి ఎపిసోడ్ మంచి కిక్ ఇచ్చింది.
ఇప్పుడీ ఎపిసోడ్ అంతకు మించి ఉండబోతోందని అనిపిస్తోంది. ఈ పార్ట్-2లో బాలకృష్ణ రాజకీయాలు ప్రధానంగా.. పవన్పై ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు.. గతేడాది పవన్ను ఓ పర్యటనలో పోలీసులు ఆపేస్తే.. జనసేనాని కారుపై ఎక్కారు.
ఆ ఫొటోను చూపిస్తూ ‘ ఏమిటి ఆ గొడవ ‘ అని అడిగారు బాలయ్య. దానికి పవన్..’కారులో వెళ్ల కూడదు, కారు నుంచి బయటకు రాకూడదు, రూమ్లో ఉండకూడదు, అందులోంచి బయటకు రాకూడదు.. అందుకే కొన్ని రోజుల తర్వాత నాకు తిక్క వచ్చింది’ అని అన్నారు.
ఆ తర్వాత అధికార యంత్రాంగం కూడా మరీ హద్దులు దాటేసి’ అంటూ.. ఘాటుగా స్పందించారు. సంభాషణలో మధ్యలో పార్టీ స్థాపించాల్సిన అవసరం ఎందుకొచ్చింది’ అని బాలకృష్ణ సీరియస్ ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా..’ చాలా మంది ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతారు.. కానీ ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడరు’ అని పవన్ జవాబిచ్చారు.
ఆ తర్వాత.. ‘నువ్వు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావొచ్చు అంటూ’ సంచలన ప్రశ్న సంధించారు బాలయ్య. దీంతో వాతావరణం అంతా వేడెక్కింది. బాలయ్య వేసిన ఓ ప్రశ్నకు పవన్ సీరియస్గా సమాధానమిచ్చారు. ‘ఎదగనివ్వకపోవడం అనేది.. వాడి వ్యూహంలో ఒక భాగం అంతే ‘ అని సీరియస్ టోన్లో అన్నారు.
‘అటెంప్ట్ టూ మర్డర్ కేసు పెట్టారని పవన్’ చెప్పారు. దీంతో ఈ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్ మరిన్ని అసక్తికర విషయాలు బయటపెడతారని అభిమానులు అనుకుంటున్నారు. కాగా, ఈ షోకు ఓ వృద్ధ మహిళ వచ్చింది.
అనంతరం కరోనా వచ్చి నా కుమారుడు చనిపోయాడని.. ఇప్పుడు పవనే నా కుమారుడని చెప్పింది. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే చనిపోతానని వెల్లడించింది. దీంతో ఆమె పాదాలకు పవన్ నమస్కరించారు.
అయితే, ఈ షోకు డైరెక్టర్ క్రిష్ కూడా వచ్చాడు. దీంతో ఆయన్ను బాలయ్య.. ‘ ఇద్దరితో పని చేశావు కదా.. డిఫరెన్స్ ఏంటి’ అని అడిగారు. దీనికి క్రిష్ స్పందిస్తూ.. ‘ఒక సింహం.. ఓ పులి మధ్యలో నా తల ఉంది’ అని అన్నారు.అనంతరం మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు బాలయ్య.
‘సినిమాలు మానేసి ప్రజాసేవకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి’ అని పవన్ను అడిగారు. అయితే, ఈ ప్రశ్నకు పవన్ సమాధానం తెలియాలంటే.. ఫిబ్రవరి పదో తేది వరకు ఆగాల్సిందే. ఇక చివరగా ‘ అణువునూ …ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది’ అంటూ బాలయ్య పవర్ ప్యాక్డ్ డైలాగ్ చెప్పారు.