• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

యురేనియం…నల్లమలకు వురేనియం

Published on : September 14, 2019 at 1:52 pm

జి. సంపత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్g sampath

నల్లమల్ల అడవుల్లో యురేనియం చిచ్చు రగులుతూనే వున్నది. గత రెండేళ్ళక్రితం అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ప్రైవేట్ కంపెనీలు పోటీ పడ్డాయి. కానీ దాని వల్లవచ్చే లాభాలు, ముడుపుల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రభుత్వమే యురేనియం తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులకు గురికావడమేకాకుండా, అనారోగ్యాల పాలవుతారని తెలిసీకూడా ప్రభుత్వం తవ్వకాలను ప్రారంభిస్తున్నదంటే, ప్రజాక్షేమం వీరికి పట్టదని అర్దమవుతున్నది.

యురేనియం తవ్వకాలతో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని, పలు ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళకు కట్టినట్లు సామాజిక కార్యకర్తలు చూపించారు. ఈ యురేనియం తవ్వకాలతో అటు వన్యప్రాణులు, ఇటు అడవితల్లి బిడ్డలకు పెద్ద కష్టమొచ్చింది. తెలంగాణ నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు అన్ని ప్రాంతాల ప్రజలు పోరాటం చెయ్యాల్సిందే. మరో వైపు తెలంగాణలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు స్థానిక ప్రజలు పోరాటం చేస్తూనే వున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు వున్నట్లు గుర్తించారు. దాంతో ప్రైవేట్ కంపెనీలకు బదులు ప్రభుత్వం ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరిపేందుకు రెడీ అయ్యింది. నల్లమల్ల అటవీప్రాంతంలో ఆమ్రాబాద్ మండలంలో 18 గ్రామపంచాయతీల్లో యురేనియం తవ్వకాల భయం మొదలైంది. ఇక్కడి అటవీప్రాంతంలో 17 పులులతో పాటు, అనేక వన్య ప్రాణులున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్ నగర ప్రజలకు తప్పని తిప్పలు

ఆమ్రాబాద్ అటవీ ప్రాంతం నాగార్జున సాగర్ డ్యాంకు ఆనుకుని వుండటంతో, యురేనియం తవ్వకాలు మొదలైతే, కృష్ణానది కూడా ఆ ప్రభావానికి గురయ్యే ప్రమాదం వుంది. ఒక్కసారి కృష్ణానది జలాలు యురేనియం ప్రభావానికి గురైతే, జంటనగరాల దాహార్తి తీరుస్తున్న కృష్ణానది జలాలు లభ్యత కష్టమవుతుంది. అదే సమయంలో నాగార్జునసాగర్ దిగువన వున్న ప్రాంతాలకు కూడా అపార నష్టం తప్పదని అంచనాలు వస్తున్నాయి. అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వజ్రాల తవ్వకాలకు అనుమతులు పొందిన డీబీర్స్ సంస్థ, ఆ ప్రాంతంలోని యురేనియం నిక్షేపాల తవ్వకాలకు కూడా అనుమతులు పొందేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ మండల పరిధిలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు పోరాటం చెయ్యాల్సిన అవసరం వుంది. గిరిజన పుత్రులకు అపార నష్టం చేకూర్చనున్న యురేనియం తవ్వకాలను నిలిపి వేసేందుకు డిమాండ్ చేయ్యాల్సిన అవసరం ఎంతైనా వుంది.

యురేనియం ప్రభావం అంతా ఇంతా కాదు..

జార్ఖండ్‌లో యురేనియం ప్రభావిత ప్రాంతాల్లో అంగవైకల్యం, వింత ఆకారాలతో పిల్లలు పుట్టడం, చర్మ సంబంధిత క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్న ప్రజలను ఉదాహరణగా మనం చూడొచ్చు. యురేనియం తవ్వకాలు ప్రారంభిస్తే ఇలాంటి దుష్పరిణామాలు భవిష్యత్తు కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎదుర్కోవలసి వుంటుంది. యురేనియం బాంబుల దాడులకు గురైన హిరోషిమా, నాగసాకి ప్రాంతాలకు ఇప్పటికీ కోలుకోలేని దుస్థితిలో వున్న సంఘటనలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంది. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ నగర జనం నడుం బిగించాలి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై, అడవి బిడ్డలను కాపాడుకునేందుకు ఉద్యమంలో కలిసిరావాల్సిన అవసరం వుంది. సేవ్ నల్లమల.. సేవ్ తెలంగాణ

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సరైన డేట్ ఫిక్స్ చేసుకున్న ఉప్పెన

సరైన డేట్ ఫిక్స్ చేసుకున్న ఉప్పెన

భారతీయుడు2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా ?

భారతీయుడు2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా ?

వ‌ర్మ మ‌రో మూవీ... ఈసారి ఎవ‌రిపై అంటే...?

వ‌ర్మ మ‌రో మూవీ… ఈసారి ఎవ‌రిపై అంటే…?

క్రేజీ ప్రాజెక్ట్ లో తాప్సి ?

క్రేజీ ప్రాజెక్ట్ లో తాప్సి ?

లూసిఫ‌ర్ కు ముహుర్తం ఫిక్స్

లూసిఫ‌ర్ కు ముహుర్తం ఫిక్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

పాస్ పోర్టు బ్రోక‌ర్ రాష్ట్రానికి సీఎం అయ్యారు- ఎంపీ అరవింద్

పాస్ పోర్టు బ్రోక‌ర్ రాష్ట్రానికి సీఎం అయ్యారు- ఎంపీ అరవింద్

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు

ఫిబ్ర‌వ‌రి 1 నుండి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు ఓపెన్

ఫిబ్ర‌వ‌రి 1 నుండి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు ఓపెన్

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టులో విచార‌ణ‌

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టులో విచార‌ణ‌

బెంగాల్ ఎన్నిక‌లు- కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మ‌మ‌త‌

బెంగాల్ ఎన్నిక‌లు- కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మ‌మ‌త‌

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎవ‌రో?

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎవ‌రో?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)