ఉక్రెయిన్, రష్యాల మధ్య గత ఫిబ్రవరి నుంచి హోరాహోరీగా యుద్ధం సాగుతున్న విషయం విదితమే. అయితే రష్యా వంటి దేశాన్ని ఎదుర్కొనడం అంత సాధ్యమైన విషయం కాదు. చిన్న దేశమైన ఉక్రెయిన్ కి అమెరికా, జర్మనీలు అండగా నిలబడుతున్నాయి. అయితే రష్యాను ఎదుర్కొనేందుకు తమకు యుద్ధ ట్యాంక్ లు కావాలని ఉక్రెయిన్ దేశం కొన్నాళ్ల నుంచి డిమాండ్ చేస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో ఆ దేశానికి యుద్ధ ట్యాంక్లను పంపేందుకు అమెరికా, జర్మనీ దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండు అగ్రదేశాలు యుద్ధ ట్యాంక్ లను పంపిస్తే.. అప్పుడు ఉక్రెయిన్ వార్ కొత్త రూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై త్వరలో ఓ ప్రణాళికను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. సుమారు 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులను పంపాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కనీసం 14 లియోపార్డ్ 2 ట్యాంక్ లను ఉక్రెయిన్ కు పంపించాలని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ భావిస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికాలో ఉన్న రష్యా అంబాసిడర్ దీన్ని తప్పుపట్టారు. యుద్ధ ట్యాంక్లు వస్తే రష్యా ఆధీనంలోకి వెళ్లిన తమ ప్రదేశాలను మళ్లీ చేజిక్కించుకోవచ్చు అని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.