ఒక వేళ ఇరాన్ అమెరికన్లపై గాని…వారి ఆస్తులపై గాని దాడులు చేస్తే ఇరాన్ లోని 52 ప్రాంతాల్లో చాలా ఫాస్ట్ గా..చాలా తీవ్రంగా దాడులు చేస్తామని ట్విట్టర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక చేశారు. అమెరికా 52 సంఖ్యను ఎంచుకోవడం వెనుక కారణం కూడా చెప్పారు. 1979 లో ఇరాన్ లోని అమెరికా రాయభార కార్యాలయంలో 52 మంది అమెరికన్లను ఏడాదికి పైగా నిర్బంధించారు. దీంతో ఆయన ఆ సంఖ్యను ఎంచుకున్నారు. అంతేకాదు… తాను ఎంచుకున్న 52 ప్రాంతాలు ఇరాన్ కు ఉన్నతమైనవి… చాలా కీలకమైనవి…ఇరాన్ సంస్కృతి పరంగా కూడా… మా లక్ష్యాల్లో ఇరాన్ కూడా ఉంది….చాలా ఫాస్ట్ గా…చాలా తీవ్రంగా దాడి చేస్తాం….అమెరికా ఇంకా ఏ మాత్రం బెదిరింపులు కోరుకోవడం లేదు” అని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఇరాన్ లో అత్యంత శక్తివంతుడైన సైనికాధిపతి జనరల్ ఖాసీం సులేమాన్ ను ఇరాక్ లో అమెరికా దళాలు మట్టుబెట్టిన తర్వాత ఇరాక్ లోని అమెరికన్లపై, అమెరికా సంస్థలపై ఒత్తిడి పెరిగింది. వారిని చంపేస్తామంటూ…వారి సంస్థలపై దాడులకు హెచ్చరికలు చేస్తున్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అమెరికా రాయభార కార్యాలయం సమీపంలో శనివారం రెండు మోర్టార్ దాడులు జరిగాయి. ఇది గాక అమెరికా భద్రతా దళాలు మోహరించిన అల్ బలాద్ ఎయిర్ బేస్ లో రెండు రాకెట్ దాడులు జరిగాయి. ఈ రెండు దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాక్ లో ఉన్న అమెరికన్లు ఎప్పుడు తమపై దాడులు జరుగుతాయోనని భయాందోళనలో ఉన్నారు. దీంతో ట్రంప్ బహిరంగ హెచ్చరిక చేశారు. జనరల్ ఖాసీం సులేమాన్ హత్యన ట్రంప్ సమర్ధించారు.