అమెరికా పర్యటనకు రావాలని భారత ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. తమ దేశానికి రావాలంటూ ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం వెల్లడించింది.
జోబైడెన్ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ అంగీకరించారని పీఎంవో పేర్కొంది. ప్రధాని మోడీ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జో బైడెన్ అమెరికాకు రానున్నారు.
అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ సెషన్లు జూన్, జూలై నెలల్లో జరగనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు షెడ్యూల్ రూపొందించనున్నట్టు పీఎంవో పేర్కొంది. 2021లో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు.
ఆ పర్యటనలోనే తొలిసారిగా ఇరు దేశాల నేతల మధ్య తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. తాజాగా అమెరికాలో పర్యటనకు రావాలని మరోసారి ఆహ్వానం అందింది. ఈ సారి అమెరికా కాంగ్రెస్ లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తెలుస్తోంది. మోడీకి అమెరికా అధ్యక్ష భవనంలో బైడెన్ విందు ఇవ్వనున్నట్టు సమాచారం.