• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
Tolivelugu Latest Telugu Breaking News » Top News » ఉత్తరాఖండ్ లో మెగా కూల్చివేతలు ?

ఉత్తరాఖండ్ లో మెగా కూల్చివేతలు ?

Last Updated: January 4, 2023 at 5:09 pm

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీ లో గల అతి పెద్ద ‘గఫూర్ బస్తీ’ ఇక ‘నేలమట్టం’ కానుందా ? ఇక్కడి 400 కుటుంబాలు రోడ్డున పడనున్నాయా ? సుమారు 4 వేలకు పైగా ఇళ్ళు, 11 స్కూళ్ళు ఓ బ్యాంక్, 10 మసీదులు, ఆలయాలు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, ఇంకా షాపులు, చిన్నా చితకా కట్టడాలు త్వరలో కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం 29 ఎకరాల ఈ భూమి తమదేనని రైల్వే శాఖ కోర్టుకెక్కడమే.. ఈ విశాల స్థలంలోని స్థానికులంతా అక్రమంగా ఇళ్ళు నిర్మించుకున్నారని, వాళ్ళను ఖాళీ చేయించాలని రైల్వే శాఖ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Banbhoolpura encroachment: SC to hear petition challenging HC's order on Jan 5 - Hindustan Times

దీంతో జనవరి 8 లేదా 9 లోగా ఈ బస్తీవాసులంతా దీన్ని వెకేట్ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించింది. అయితే ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్న తామెక్కడికి పోవాలంటూ వీరంతా భారీ నిరసనలు చేబట్టారు. ధర్నాలు చేశారు.. కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టుకెక్కారు. ఈ పిటిషన్ ని అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారించనుంది. బుధవారం ఈ బస్తీలోని మసీదుల్లో పెద్ద సంఖ్యలో ముస్లిములు ప్రార్థనలు చేశారు. సుప్రీంకోర్టు కూడా తమకు ప్రతికూలంగా తీర్పునిస్తే ఏం చేయాలని బస్తీవాసుల్లో చాలామంది విలపించారు.

కోర్టు తీర్పు ఎలా ఉన్నా హల్ద్వానీ లో అప్పుడే భారీ ఎత్తున పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించారు. ఇన్ని కట్టడాల కూల్చివేతకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మెగా కూల్చివేతలకు అవసరమైన హంగులనన్నీ అధికారులు సిద్ధం చేశారు.

ఈ బస్తీ వాసుల్లో చాలామంది ముస్లిములు అయినందున బీజేపీ ప్రభుత్వం ఇలా కక్షపూరిత చర్య తీసుకుంటున్నదని ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ ఆరోపించారు. ఈ స్థానికుల్లో పలువురు మహిళలు, పిల్లలు, గర్భిణులు, వృద్దులు ఉన్నారని, వారి ఇళ్లను కూల్చివేస్తే వారంతా రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ రాష్ట్రానికి గార్డియన్ అని, బహుశా ఆయన వీరిని ఆదుకోవచ్చునని చెప్పిన హరీష్ రావత్.. తన ఒక గంట మౌన దీక్షను ఆయనకు ‘అంకితం’ చేస్తున్నానని పేర్కొన్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap