తెలంగాణతో పాటు ఏపీలో 36 చోట్ల వంశీరామ్ బిల్డర్స్ పై ఏక కాలంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో రెండో రోజు వంశీ రామ్ బిల్డర్స్ పై సోదాలు కొనసాగుతున్నాయి. ఆ సంస్థ ఎండీ సుబ్బారెడ్డితో పాటు ఆయన బావ మరిది జనార్థన్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వారితో పాటు కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు, సిబ్బంది ఇళ్లలోనూ.. రెయిడ్స్ జరుగుతున్నాయి.
వంశీరామ్ బిల్డర్స్ లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి వ్యాపారవేత్త మల్లిఖార్జున రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆయన బంధువుల నివాసాల్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అయితే మంగళవారం ఐటీ శాఖ తెలంగాణ, ఏపీలోని 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లో 15 ప్రాంతాలు, ఏపీలోని 20 ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు రెయిడ్స్ కొనసాగాయి. జూబ్లిహిల్స్ పెద్దమ్మ టెంపుల్ సమీపంలోని వంశీరామ్ బిల్డర్స్ కార్పొరేట్ ఆఫీస్ ను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక నిన్నటి సోదాల్లో ఐటీ అధికారులకు కీలక పత్రాలు దొరికినట్టు
సమాచారం.
అయితే లిటిగేషన్ లో ఉన్న స్థలాలు కొనుగోలు చేసి అక్రమ ప్రాజెక్టులు నిర్మించినట్టు వంశీరామ్ బిల్డర్స్ ఆరోపణలున్న నేపథ్యంలో.. ఐటీ అధికారులు…ఈ ప్రాజెక్టుల్లో జరిగిన లావాదేవీలపై ఫోకస్ పెట్టారు.