దేశం మొత్తం కరోనా భయంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. ఒక వైపు లాక్ డౌన్ నడుస్తున్నా ప్రియురాలితో రాసలీలలు కొనసాగించాడు ఓ భర్త. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని వనస్థలిపురంలో మున్సిపాలిటీకి వైస్ చైర్మన్గా ఎన్నికైన అనిల్ అనే వ్యక్తి.. లాక్డౌన్ సమయంలోనూ ఓ లాడ్జిలో చేరి ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. లాడ్జి యజమాని కూడా అనిల్కు తోడు కావడంతో అమ్మాయిలను పిలిపించుకుని రాసలీల్లో మునిగితేలుతున్నారు.
ఇంట్లో రోజు లానే పని ఉంది అంటూ బయటకు వచ్చాడు. లాడ్జిలో ప్రియురాలితో గడుపుతున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అతని భార్య లాడ్జిలో వ్యభిచార ముఠా ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చింది.. దీంతో వనస్థలిపురంలోని లాడ్జిపై దాడి చేశారు పోలీసులు. ముగ్గురు అమ్మాయిలతో పాటు అనిల్, లాడ్జి యజమాని సునీల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.