మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే అతను మాట్లాడే క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
దేశానికి కొత్త రాజ్యాంగం కావాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పించారు. తాజాగా, టీడీపీ ఏపీ నేత వర్ల రామయ్య కూడా ఈ విషయంపై స్పందిస్తూ కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ను తన అర్ధంలేని మాటలతో అవమానించినట్టే వ్యవహరించారని అన్నారు.
కొత్త రాజ్యాంగం కావాలంటాడేంటి ఆ ముఖ్యమంత్రి. అంటే.. డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అక్కర్లేదా? అవసరమైనప్పుడు రాజ్యాంగానికి మార్పులు చేసుకునే అవకాశం ఉందని ఆయనకు తెలియదా..? ఈ మాత్రం తెలియకుండా సీఎం ఎలా అయ్యాడని వ్యంగ్యంగా మాట్లాడారు.
Advertisements
కొత్త రాజ్యాంగం కావాలనడంలోనే అంబేడ్కర్ ను అవమానించినట్టని అర్థం చేసుకోవాలన్నారు. నిజంగా సీఎం కు రాజ్యాంగంపైన, అంబేద్కర్ పైనా ఏమాత్రం గౌరవం ఉన్నా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యలను భారతీయులుగా ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.