ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. ఒక్కొక్కరుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు స్పందిస్తున్నారు. కాగా తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదన్నారు వర్మ.
అసలు వారు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారని అలాంటి వారు ప్రభుత్వంతో గొడవపడాలని ఎందుకు అనుకుంటారని అన్నారు. అందుకే కామ్గా ఉంటున్నారని అన్నారు. హీరోల రెమ్యూనరేషన్పై ఏపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలని స్టుపిడ్ ఆర్గ్యుమెంట్స్గా కొట్టిపారేశారు వర్మ. ఎందుకంటే నిర్మాత ఎంత పెట్టి సినిమా నిర్మించాడనేది ఎవరూ చూడరు.. పలానా హీరో బొమ్మ అని మాత్రమే ప్రేక్షకులు థియేటర్కి వస్తారని, హీరో అనేవాడు బ్రాండ్ అని వర్మ పేర్కొన్నారు.