నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు వచ్చి మంచి వసూళ్లతో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పదిరోజుల్లో రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ నిలిచిందని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. బాలయ్యకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని.. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు.
బాలయ్య సరసన శ్రుతిహాసన్,.మలయాళీ బ్యూటీ హనీరోజ్ నటించారు. నటసింహం చెల్లెలుగా వరలక్ష్మి శరత్కుమార్ నటించి ఆకట్టుకుంది. 2021లో బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ సినిమా ఘనవిజయం సాధించింది. కొవిడ్ రెండో దశ తర్వాత విడుదలై.. థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన సినిమాగా అఖండ నిలిచింది.
2021 డిసెంబర్ 2న విడుదలైన అఖండ.. పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాలయ్య కెరీర్లో తొలిసారి రూ.100కోట్లు సాధించిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు సృష్టించింది
అంతేకాకుండా 2021 సంవత్సరానికి సంబంధించి ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన చిత్రంగా నిలిచింది. ఓటీటీలోకి వచ్చి 24 గంటల్లోనే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలోనూ కలిపి రూ.53కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
నేరుగా నాలుగు సెంటర్లలతో పాటు మొత్తంగా 20 కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది. మొత్తంగా వంద రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.94.27కోట్లు షేర్, రూ.156కోట్లు గ్రాస్ వసూలు చేసింది.