వేములవాడలో మూల వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన మళ్లీ కూలింది. గతంలో ఓసారి వరద దాటికి కొట్టుకుపోయినా తాజాగా నిర్మాణ పనులు చేపట్టారు. అయితే తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన మళ్లీ కొట్టుకుపోవటంతో నాణ్యతపై అనుమానాలొస్తున్నాయి.కమిషన్ల కక్కుర్తికి ఇదే సాక్ష్యం అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేములవాడలో రాజరాజేశ్వరస్వామి భక్తులకు గుడికి వెళ్లేందుకు,వచ్చేందుకు వేర్వేరు దారులుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 28కోట్లతో ఐదు సంవత్సరాల క్రితం వంతెన పనులు ప్రారంభించింది. కానీ పనులు నత్తనడక సాగుతుండటం, వర్షాకాలంలో వాగు ప్రవహించటంతో పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి.