దృశ్యం మూవీకి సీక్వెల్గా మలయాళంలో వచ్చిన దృశ్యం 2 హిట్ టాక్తో దూసుకుపోతోంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాని ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోహన్లాల్ నుంచి మరో మాస్టర్ పీస్ వచ్చిదంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లుకురుస్తోంది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంపై తొలుత అనుమానాలు నెలకొన్నాయి. దృశ్యం సీక్వెల్లో నటించేందుకు విక్టరీ వెంకటేష్ ఆసక్తిగా లేడని ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని తేలిపోయింది.
దృశ్యం 2 రీమేక్లో వెంకటేషన్ నటిస్తున్నట్టు దాదాపుగా అధికారికంగా కన్ఫామ్ అయింది. డైరెక్టర్ జీతూ జోసెఫ్, నిర్మాత సురేష్ బాబుతో కలిసి వెంకీ దిగిన ఫొటో ఒకటి బయటపడింది. దీంతో దృశ్యం 2 రీమేక్లో వెంకీ నటిస్తున్నాడని అభిమానులు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ రీమేక్ రైట్స్ని సురేష్ బాబు దక్కించుకున్నారు.