గవర్నర్ ని కేసీఆర్ అవమానించారని కాంగ్రెస్ నేత వీహెచ్. రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం వెళ్లకపోవడం అన్యాయమైన చర్య అని అన్నారు. ఈ విషయంలో తాను గవర్నర్ ని కలుస్తానని అన్నారు. జెండా వందనానికి హాజరుకాని మొట్టమొదటి సీఎం కేసీఆర్ చరిత్రకెక్కుతారని. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారని అన్నారు.
ఇక రీపబ్లిక్ డే సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడారని కొనియాడారు వీహెచ్. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఎస్సీ సామాజిక వర్గం మీద గౌరవం ఉంటే పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లాకు వెళ్ళిన తమపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు దురుసుగా మాట్లాడారని మనుషులు వీహెచ్. అందుకు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశామన్నారు. అతనికి షోకాజ్ నోటీసు ఇవ్వని కమిటీ మాట ఇచ్చిందని.. అది ఇవ్వకపోతే మౌన దీక్ష వీహెచ్.
Advertisements
ఇటు ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపైనా వీహెచ్ స్పందించారు. దీనికి సంబంధించి సీఎం జగన్ వీహెచ్ లేఖ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సంజీవయ్య ప్రజలకు అనేక సేవలు చేశారని కొనియాడారు వీహెచ్.