మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ఇంట,బయట అని తేడా లేకుండా సగటు మహిళ ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురవుతోంది. చిన్న పిల్లలు మొదలుకొని..ఆరు పదులు వయస్సు ఉన్న వృద్ధురాలు సైతం వేధింపులకు గురవుతున్నారు.
అత్యాచారం,లైంగి వేధింపులు,వికృత చేష్టలతో కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా సికింద్రాబాద్ లో ఓ ఘటన ఇలాంటిదే చోటుచేసుకుంది. చూడ్డానికి పెద్ద మనిషిగా ఉన్న ఓ కామాంధుడు నీచమైన పనికి ఒడిగట్టి.. అడ్డంగా బుక్ అయ్యి.. జనం చేతిలో చావు దెబ్బలు తిన్నాడు.
ఆంటోని అనే వ్యక్తి మహిళలను టార్గెట్ చేసి వారు స్నానాలు చేస్తున్న దృశ్యాలను వీడియోలు తీశాడు. దొంగ చాటుగా బాత్ రూంల పైకి ఎక్కి తన సెల్ ఫోన్లో వీడియోలు చిత్రీకరిస్తున్నాడు. వాటిని అడ్డు పెట్టుకొని అతడు తరువాత ఏం చేద్దామని అనుకున్నాడో తెలియదు గానీ.. ఇంతలోనే స్థానికుల కంట పడ్డాడు.
ఇంకేముంది ఆంటోనిని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేశారు. సెల్ ఫోన్ లాక్కొని.. పెద్ద మనిషిలా ఉన్నావు.. చూస్తే పద్ధతిగా ఉన్నావు.. ఇదేం పాడు పని అంటూ తిట్ల దండకం మొదలు పెట్టారు. అంతటితో ఆగకుండా తాళ్లతో అతడ్ని కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఆంటోనిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని మహిళలు కోరుతున్నారు