విజయ డైరీ టర్నోవర్ ను రూ.1000 కోట్లకు పెంచుతామన్నారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో విజయ డెయిరీకి చెందిన నూతన ఐస్క్రీమ్ పుష్కార్ట్స్ ను ప్రారంభించారు. పాడిపరిశ్రమను రాబోయే రోజుల్లో మరింతగా విస్తరిస్తామని మంత్రి తెలిపారు.
హైదరాబాద్లో ఇంకా 35 లక్షల లీటర్ల పాల డిమాండ్ ఉందన్నారు మంత్రి. అందుకు అనుగుణంగా రైతులను పాడి వైపు మల్లిస్తే.. వారికి మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు. 2014కు ముందు 400 కోట్ల టర్నోవర్ ఉన్న విజయ డైరీని త్వరలో 1000 కోట్లకు పెంచుతామని వివరించారు.
విజయ డైరీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని..వేసవిలో డైరీ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేయాలని 50 శాతం సబ్సిడీ కింద వీటిని ఇస్తున్నామని తెలిపారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద ఆధారం లేనివారికి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ట్రై సైకిల్స్ పెంచుతామని.. తద్వారా జిల్లాల్లో ఉత్పత్తి జరిగితే రవాణా ఖర్చు తగ్గుతుందని అన్నారు.
పుష్ కాట్స్ తో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదని.. ఎక్కడా కావాలంటే అక్కడ అమ్ముకోవచ్చు అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చాలా మార్గదర్శకాలు తీసుకువచ్చిందని వివరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్.