• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » మహిళలపై ఘోరాలు.. విజయశాంతి ఆవేదన

మహిళలపై ఘోరాలు.. విజయశాంతి ఆవేదన

Last Updated: May 3, 2022 at 12:28 pm

తెలుగు రాష్ట్రాల్లో జుగుప్స కలిగించే దారుణాలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు బీజేపీ నేత విజయశాంతి. కామంతో కళ్లు మూసుకుపోయిన పాపాత్ములకు పసి పిల్లలు, బాలికలు, నడి వయసు మహిళలనే తేడా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రతీ దానికి ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని మాత్రమే వేలెత్తి చూపడం వల్ల లాభం లేదన్నారు. వ్యక్తిగా మనమేం చేస్తున్నాం? ఇంట్లోని ఆడపిల్లకు అండగా నిలిచేలా అబ్బాయిలను మలుచుకుంటున్నామా? అని ప్రశ్నించారు.

ఇటీవలి కాలంలో విద్యార్థి లోకం, యువతరం డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకున్నాయని అన్నారు విజయశాంతి. హైస్కూల్‌ స్థాయిలో సైతం పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడుతుండటం, గంజాయితో పార్టీలు చేసుకోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవిగాక బైక్ రేస్‌ లు, బెట్టింగులు కూడా ఉన్నాయని చెప్పారు. సిగ్గుపడేలా.. తలదించుకునేలా సంచలన ఘటనలు జరిగినప్పుడల్లా కొన్ని రోజుల పాటు ర్యాలీలు, నిరసనలు చేసి ఆయాసంతో ఆగిపోవడం తప్ప.. ఒక స్థిర సంకల్పంతో ఎంత మేరకు మనం విమెన్ ఫ్రెండ్లీ సమాజాన్ని నిర్మించుకున్నామన్నారు.

సమాజంలో ఈ తీరు మారే వరకూ స్త్రీల ఉద్ధరణ పేరిట ఎన్ని పథకాలు పెట్టినా… ఒరిగేదేమీ ఉండదని చెప్పారు విజయశాంతి. ఇంట్లో మొదలుపెట్టి స్కూల్‌, కాలేజీ, ఆఫీస్… ఇలా ప్రతి దశలోనూ స్త్రీని గౌరవప్రదంగా చూసే వాతావరణాన్ని కల్పించాలన్నారు. దోషులకి ఒక పక్క శిక్షలు పడుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుందనే పరిశోధన, సంస్కరణ వెను వెంటనే జరగాలని తెలిపారు.

ఒకనాటి తన సందేశాత్మక చిత్రం ప్రతిఘటనను పదే పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం నేటికీ కనిపించడం దురదృష్టకరమన్నారు విజయశాంతి. దయచేసి అందరూ మేలుకోవాలని.. సృష్టికి మూలంగా నిలిచిన స్త్రీని గౌరవించేలా సమాజాన్ని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కేటీఆరే నెంబ‌ర్ వ‌న్.. నెట్టింట కుంప‌టి పెట్టిన ఫోటో..!

అప్పులు చేస్తాం.. వివరాలు చెప్పం!

చేతగాని ముఖ్యమంత్రి అవసరమా?

పంబన్ బ్రిడ్జి.. కొత్త అంగుల‌తో నిర్మాణం..!

కరోనా భారత్ లోనే పుట్టింది.. శ్రీరాముడి జన్మస్థలం నేపాల్..!

పోడు రైతులకు పట్టాలు ఎక్కడ?

ర‌ష్యా ఆధీనంలో.. ఉక్రెయిన్ కీల‌క ప్రాంతం..!

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

అదృష్టం వ‌రించింది..చమీలీ బాయ్ మురిసింది..!

ప‌బ్ పై దాడులు.. 18 మంది అరెస్ట్..!

ఘోర రోడ్డు ప్రమాదం… ఏడుగురు మృతి..!

అవినీతి చిట్టాతో ముఖ్యమంత్రిని కలుస్తాం…!

ఫిల్మ్ నగర్

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

భారీ న‌ష్టాల్లో.. కంగనా సినిమా..!

kgf 2 dialogues

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

సావర్కర్ బయోపిక్... అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)