మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పై జారీ చేసిన అరెస్టు వారెంట్ పెండింగ్పై కోర్టులో విచారణ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా అంశంపై ర్యాలీ చేశారు. 2016 మే 10న కొడాలి నాని, మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు మరికొందరు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వన్వేలో ర్యాలీ నిర్వహించారు.
అయితే పోలీసుల ఉత్తర్వులు, నిబంధనలు ఉల్లంఘించినందుకు.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో అప్పుడు గవర్నర్పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుల విచారణకు కొడాలి నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేసింది.
ఈ ఏడాది జనవరి 5 నుంచి పెండింగ్లో ఉంది. వాయిదాలకు కొడాలి నాని రాకపోవడంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గవర్నరుపేట సీఐ సురేష్ కుమార్ గురువారం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.
నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్లో ఉందని.. దాన్ని అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రీదేవి సీఐని ఆదేశించారు. ఈ కేసులో కొడాలి నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు.