భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డికి శాయంపేటలో నిరసన ఎదురయ్యింది. గండ్రతో పాటు వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ జ్యోతి వాహనాన్ని కూడా నిరసనకారులు అడ్డుకున్నారు.
రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన బాధితులు ఆయనను అడ్డుకున్నారు. రోడ్డు వెడల్పులో గూడు కోల్పోయిన తమకు వేరే చోట ఇళ్లు ఇప్పించాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.
నిరసనకారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇళ్లు కట్టించిన తరువాతే ఎన్నికలకు వెళ్దామని జెడ్పీ ఛైర్ పర్సన్ సర్ది చెప్పడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.