వికారాబాద్ జిల్లా యాలాలలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని యువకుడు కిడ్నాప్ చేసి ఆమె పై అత్యాచారం చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని కారులో ఎత్తుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు రఘుపతి అనే యువకుడు.
విహార యాత్ర కోసం స్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థులను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. తిరిగి అర్థరాత్రి సమయంలో విద్యార్థులు స్కూల్ కు చేరుకున్నారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు స్కూలుకు రాకపోవడంతో హెడ్ మాస్టర్ రఘుపతి అనే వ్యక్తికి బాలికను అప్పగించి.. ఇంటి దగ్గర దింపాలంటూ సూచించారు.
దీంతో రఘుపతి బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. 2 రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో వారు యాలాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రఘుపతిని అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్ మాస్టర్ వెంకటయ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.