• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

గుడ్ వర్క్ విశాఖ సీపీ గారూ.. బట్?

Published on : August 29, 2020 at 2:56 pm


శిరోముండనం కేసులో విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా చాలా ఫాస్ట్ గా వ్యవహరించారు. చాలా స్పీడుగా.. సీసీ ఫుటేజ్ తీయడం.. వెంటనే నిందితులను గుర్తించడం.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిజంగా విశాఖ సీపీని అభినందించాల్సిందే. దళితుడు అంటే ఇప్పటికీ ఎలా చూస్తున్నారో ఈ సంఘటన బయటపెట్టింది. దళితుడు అంటే దొంగతనం చేసేవాడు.. ఎదురు తిరక్కుండా ఉండాల్సినవాడు అన్న డిక్షనరీనే చదివినవారంతా అదే రూటులో ఉన్నారు. ఎన్ని చదువులు చదివినా.. ఎంత సంపాదించినా.. వారు మానవత్వం మరిచి దళితుడిని అవమానించి.. సంస్కారాన్ని మాత్రం సంపాదించలేకపోయారని ప్రూవ్ చేసుకున్నారు.

కేవలం ఒక మొబైల్ కనపడకుండా పోయిందని.. ఆ కుర్రాడిని అంత దారుణంగా హింసించారు. ఇంకా పైగా.. శిరోముండనం చేసి.. తమ కసి తీర్చుకున్నారు. ఆడవారు సైతం బెల్టుతో దారుణంగా కొడుతున్న సీన్లు చూస్తుంటే.. మన సమాజం అందించిన కుసంస్కారాన్ని యంగ్ జనరేషన్ సైతం ఎంతగా ఎక్కించుకున్నారో అర్ధమవుతోంది.
అయితే ఇక్కడే వైసీపీ సర్కార్ కు ఒక ప్రశ్న. ఘటన బయటికొచ్చిన 24 గంటల్లోనే చర్యలు తీసుకున్న పోలీసులు… మరి గోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసులో.. ఇంత ఫాస్ట్ గా ఎందుకు రియాక్ట్ కాలేదు? పైగా రాష్ట్రపతి జోక్యం చేసుకున్నాక గాని ఆ ఫైలు కదలలేదు. ఆన్సర్ మన దగ్గర ఉంది. అక్కడ నిందితుడు వైసీపీ నేత కాబట్టి.. అలా చేసుండొచ్చు. కాని అదే ఆన్సర్ వైసీపీ నేతల నోట వినాలనుంది.

అంతెందుకు ఇదే విశాఖ సీపీ మనీష్ కుమార్ సిన్హా.. మొన్న వాలంటీర్ ను వేధించి.. ఆమె భర్తపై కత్తితో దాడి చేసిన వైసీపీ నేతను అరెస్ట్ చేయలేకపోయారు. పైగా కేసు కూడా పెట్టలేకపోయారు. ఎదురు బాధితులపైనే కేసు పెట్టారని.. స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ కుటుంబం జనసేన అభిమానులట. అందుకనే పవన్ కల్యాణ్ రియాక్టరయ్యారు.  మరి అదే విశాఖ నగరంలో ఒక చోట ఒక్కో తీరుగా పోలీసులు వ్యవహారం చేస్తారా? నిందితులు వైసీపీ వారైతే.. ఒకలా.. వేరేవారు అయితే ఒకలా ఉంటారా? అదే అర్ధం కావడం లేదు. మరి కనీసం డీజీపీ గౌతమ్ సవాంగ్ గారైనా దీనిపై వివరణ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ కేసులో రియాక్ట్ అయినట్లే.. అన్ని కేసుల్లో రియాక్ట్ అయితే… దళితులు కాస్త పోలీసులపై నమ్మకం పెట్టుకుంటారు. లేదంటే వేరేగా ఉంటారు.

tolivelugu app download

Filed Under: రాజకీయాలు

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సరైన డేట్ ఫిక్స్ చేసుకున్న ఉప్పెన

సరైన డేట్ ఫిక్స్ చేసుకున్న ఉప్పెన

భారతీయుడు2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా ?

భారతీయుడు2 షూటింగ్ స్టార్ట్ అవుతుందా ?

వ‌ర్మ మ‌రో మూవీ... ఈసారి ఎవ‌రిపై అంటే...?

వ‌ర్మ మ‌రో మూవీ… ఈసారి ఎవ‌రిపై అంటే…?

క్రేజీ ప్రాజెక్ట్ లో తాప్సి ?

క్రేజీ ప్రాజెక్ట్ లో తాప్సి ?

లూసిఫ‌ర్ కు ముహుర్తం ఫిక్స్

లూసిఫ‌ర్ కు ముహుర్తం ఫిక్స్

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

పాస్ పోర్టు బ్రోక‌ర్ రాష్ట్రానికి సీఎం అయ్యారు- ఎంపీ అరవింద్

పాస్ పోర్టు బ్రోక‌ర్ రాష్ట్రానికి సీఎం అయ్యారు- ఎంపీ అరవింద్

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కొత్త కేసులు

ఫిబ్ర‌వ‌రి 1 నుండి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు ఓపెన్

ఫిబ్ర‌వ‌రి 1 నుండి తెలంగాణ‌లో విద్యాసంస్థ‌లు ఓపెన్

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టులో విచార‌ణ‌

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై హైకోర్టులో విచార‌ణ‌

బెంగాల్ ఎన్నిక‌లు- కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మ‌మ‌త‌

బెంగాల్ ఎన్నిక‌లు- కీల‌క నిర్ణ‌యం తీసుకున్న మ‌మ‌త‌

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎవ‌రో?

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎవ‌రో?

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)