మోడీ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ తీవ్ర స్థాయిలో మండిప్డడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను బీజేపీ డంపింగ్ యార్డ్ గా మార్చబోతోందని ఫైర్ అయ్యారు. మోడీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో త్వరలో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని ఆయన తెలిపారు.
జనం మద్దతు ఉంటే ఎందుకు పోలీసుల వలయంలో తిరుగుతున్నావ్..జగన్ అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు అంత భయం జగన్ కి..కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛగా తిరగలేని ఆయన.. ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసురుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు.
ఇక మోడీ..జగన్ ది నియంత పాలన అని, వీరివల్ల రాష్ట్రం నాశనం అవుతోందని విమర్శించారు నారాయణ. ఎవరు ఎలా పోటీ చేయాలో జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపికి ఉండేది ఒక సంవత్సరం ఆయుష్షు మాత్రమే అని జోష్యం చెప్పారు. విశాఖ పట్నం సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే హాస్యాస్పదంగా ఉందన్నారు.
అవన్నీ కాకి లెక్కలని విమర్శించారు. పారిశ్రామిక కంపెనీలను తరిమేసి ఇప్పుడు పెట్టుబడులంటే ఎలా అని నారాయణ ప్రశ్నించారు. మూడు రాజధానులు అన్నప్పుడు ఏపీ పై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయిందన్నారు ఆయన.