విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మంది నిందితులకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందినవారిలో దక్షిణ కొరియాకు చెందినవారు కూడా ఉన్నారు. ఈ కేసులో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ, డైరెక్టర్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ విషవాయువు లీకై 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి, కేసు పెట్టిన నేపథ్యంలో నిందితులకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.