విష్ణుకుమార్ రాజు ,
బీజేపీ నేత.
ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోవడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏపీలో వైసీపీ, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, అందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనం. వైసీపీతో ఉన్నామన్న ముద్ర తొలగించుకోకపోతే బీజేపీకి మున్ముందు ఫలితాలు ఇంతకంటే తీవ్రంగా ఉంటాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆదరించకపోవడాన్ని గమనించాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలు ఏవీ పనిచేయకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతాలుగా భావించాలి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఈ కలయిక తప్పనిసరి.
ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలవడం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిరక్షణకు అనివార్యం. ఒత్తిళ్లు, ప్రలోభాలు, పెట్టినా వైసీపీని ఆదరించకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పునకు నిదర్శనం. పొలిటికల్ వ్యాక్యూమ్ ను తెలంగాణ బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. ఏపీలోనే టీఎస్ మోడల్ విధానాలు బీజేపీ ఎదుగుదలకు అవసరం.