ఇటీవల కాలంలో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో న్యూ మోడల్స్ను మార్కెట్లోకి లాంఛ్ చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా వివో ఎక్స్70 సిరీస్కు కొనసాగింపుగా ఎక్స్80 సిరీస్ ఫోన్లను కూడా మార్కెట్లోకి రానుంది.
ఈ మేరకు వివో సంస్థ ఈ నెల చివర్లో ఎక్స్80 సిరీస్ను విడుదల చేయనుంది. ఆ తర్వాత కొన్ని వారాలకే అవి భారత్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఎక్స్70 సిరీస్ ఫోన్లు కూడా తొలుత చైనాలో విడుదల అయిన కొద్ది వారాలకే భారత్ మార్కెట్కు రావడం గమనార్హం. వివో స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా మొబైల్ ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకమైన ఫీచర్లతో విడుదల చేశారు. ఇది వరకు వివో ఎక్స్ సిరీస్లో వచ్చిన స్మార్ట్ఫోన్లలో మొబైల్ ఫోటోగ్రఫీకి సంబంధించిన బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. అయితే, వివో ఎక్స్80 సిరీస్ ఫోన్ల ఫీచర్ల వివరాలను కంపెనీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
కానీ, చైనాకు చెందిన డిజిటల్ చాట్ స్టేషన్ వీటి వివరాలను బయటపెట్టింది. దాని ప్రకారం ఈ సిరీస్ ప్రత్యేకలు చూస్తే.. వివో ఎక్స్ 80, ఎక్స్ 80 ప్రో అనే రెండు వేరియంట్లు కొత్తగా మార్కెట్లోకి రానున్నాయని తెలుస్తోంది. వివో ఎక్స్ 80లో 6.78 అంగుళాల ఈ5 అమోలెడ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ స్క్రీన్, 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేట్తో డిస్ ప్లే ఉంటుంది. పంచ్ హోల్ డిస్ ప్లే డిజైన్ తో ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తో రానుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్5 ప్రోలోనూ ఇదే చిప్ సెట్ ను వాడారు.
ఇక వివో ఎక్స్ 80 ప్రోలో హాప్టిక్ ఫీడ్ బ్యాక్ మరింత మెరుగ్గా ఉండేందుకు ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్ను వాడారు. వేడిని బయటకు పంపించేందుకు 4,000ఎంఎం స్క్వేర్ చాంబర్ ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా (వెనుక భాగంలో) సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సల్ శామ్ సంగ్ జీఎన్ 5 సెన్సార్, 13 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 12 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 663 సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 44 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. ఎక్స్80లో ఉండే డిస్ ప్లేనే ఎక్స్ 80ప్రోలో ఉంటుంది. కాకపోతే ప్రో వెర్షన్లో క్యూహెచ్ డీ ప్లస్ స్క్రీన్ ఉంటుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి.