మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుందని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.
‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 2 పాటల చిత్రీకరణ కోసం చిరంజీవి, హీరోయిన్ శ్రుతి హాసన్ తో పాటు చిత్ర యూనిట్ యూరప్ వెళ్ళింది. అక్కడ వండర్ ఫుల్ లొకేషన్స్ లో పాటల్ని షూట్ చేస్తారు.
ఇప్పటికే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్ ‘బాస్ పార్టీ’.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్గా మారడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్లు బ్లాక్బస్టర్ నోట్లో ప్రారంభమయ్యాయి. ఇదే ఊపులో మరో సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి కలిసి స్క్రీన్ప్లే అందిస్తున్నారు.