రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోవడంతో పాటు.. పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అయితే.. రాష్ట్రంలోని ప్రధాన ఆలయమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి పరిసరాలు కూడా వర్షపునీటితో మునిగిపోయాయి.
వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకున్న ఆలయాధికారులు.. సన్నిధిలో ఎక్కడెక్కడ వర్షపు నీరు చేరి మట్టి పేరుకపోయిందో పరిశీలించారు. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, రింగ్ రోడ్డు వద్ద ఆర్ ఎండ్ బి అధికారులు పరిశీలించారు.
ప్రధానాలయం మండపాలకు మరమత్తులు మొదలు పెట్టారు. కొండపైన గల విష్ణు పుష్కరిణి వద్ద మట్టి అంతా ఒకే చోటకు పేరుకుపోవడంతో ప్రత్యేక సిబ్బందితో దానిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పనులు శరవేగంగా పనులు జరిగేలా చర్యలు చేపట్టారు.
ఆలయ ప్రాంగణంలో వర్షం నీటితో చెత్తా చెదారంతో నిండిన మట్టిని తీసి పక్కన పోశారు. క్యూలైన్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకా శిల్పులు వాటర్ క్యూరింగ్ పరిశీలించి మరమత్తు పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు అధికారులు.