• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Hyderabad » నిప్పులు కురిపిస్తోన్న భానుడు.. గత 122 ఏళ్లలో ఇదే మొదటిసారి

నిప్పులు కురిపిస్తోన్న భానుడు.. గత 122 ఏళ్లలో ఇదే మొదటిసారి

Last Updated: April 2, 2022 at 5:32 pm

ఈసారి వేసవికాలం ప్రారంభంలోనే భానుడు నిప్పులు చేరుగుతున్నాడు. ఆయన ఉగ్రరూపానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వచ్చే మూడు నెలల పాటు ఉష్ణోగ్రతలు మరింత తారాస్థాయికి చేరనున్నాయి. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్‌, మేలో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ షాకింగ్ వివరాలు వెల్లడించింది. గత 122 ఏళ్లలో ఈ మార్చి నెలలో అత్యంత ఎక్కుడ ఉష్ణోగ్రతలు నమోద అయ్యాయి తెలిపింది.

అయితే, 1901 నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఐదో ఏడాదిగా 2021 నిలిచిందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) గత ఏడాది తెలిపింది. ఈసారి అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని వివరించింది. రికార్డులను బద్దలు చేసే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చిలో నమోదైనట్టు ఐఎండీ ప్రకటించింది. 1901 తర్వాత ఇంతటి వేడి వాతావరణం నమోదు కావడం ఇదే మొదటి సారి అని పేర్కొంది. 2022 మార్చి నెలలో సగటు ఉష్ణోగ్రతలు 33.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఇక “1901 నుంచి నమోదైన ఉష్ణోగ్రతలో పోలిస్తే 2016, 2009, 2017, 2010 తర్వాత 2021లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో సాధారణం కన్నా 0.710 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. 2009లో 0.550 డిగ్రీల సెల్సియస్‌, 2017లో 0.541 డిగ్రీల సెల్సియస్‌, 2010లో 0.539 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉన్నాయి” అని గత ఏడాది ఐఎండీ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో సగటు పగటి ఉష్ణోగ్రత గత రికార్డులన్నింటినీ అధిగమించింది.

ఈ ఏడాది పొడి వాతావరణం ఎక్కువ రోజుల పాటు ఉండడమే వేడి పెరగడానికి కారణంగా తెలిపింది. ఏప్రిల్ 3 నుంచి 6 మధ్య తీవ్ర వడగాలుల రిస్క్ ఉంటుందని అంచనా వేసింది. అందుకనే మధ్యాహ్న సమయంలో అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ ఇప్పటికే సూచించడం గమనార్హం.

గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అందుకు కారణం నగరాల్లో చోటుచేసుకుంటున్న మార్పులేని నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది ఎండలు మార్చి నుంచి ఠారెత్తిస్తున్నాయి. వాస్తవానికి ఈ వేసవి సీజన్ కూల్‌గా ఉంటుందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనాలు వేయగా.. అవి బోల్తా కొట్టాయి. ఐఎండీ అంచనాలకు భిన్నంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలాను తీసుకోవాలని చెప్పారు. పండ్ల రసాలు, శీతల పానీయాలు తీసుకోవాలని తెలిపారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఫైనల్ కు గుజరాత్.. క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్!

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

కోనసీమ కొట్లాట… ప్రభుత్వ వైఫల్యమన్న పవన్!

కోనసీమ.. రణసీమ.. రేపు మరో నిరసనకు పిలుపు

రాజ్యసభ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ప్రలోభాలతో అధికారం..టీఆర్ఎస్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్

భగ్గుమంటున్న సూర్యుడు..గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

మంత్రి ఇంటికి నిప్పు..అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత

త్వరలో పార్థసారథి ఫుల్ ఎపిసోడ్..వివరాలు సేకరిస్తున్నా: జగ్గారెడ్డి

కాక్ పిట్‌లో ఆ పని చేసిన పైలట్..ఉద్యోగం ఊస్ట్

రష్యా అధ్యక్షుడిపై హత్యాయత్నం..తృటిలో తప్పించుకున్న పుతిన్

కేసీఆర్‌ ను దింపేద్దాం.. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం!

ఫిల్మ్ నగర్

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

15 వందలతో మొదలు పెట్టిన స్టార్ హీరోయిన్.. అగ్రిమెంట్ కాపీ వైరల్!

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

మిస్టర్ పర్ ఫెక్ట్ తో నాకు సంబంధం లేదు

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

రేణు దేశాయ్ తో పవన్.. వైరల్ అయిన పిక్

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన రాజమౌళి

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

రామ్ గోపాల్ వర్మపై ఛీటింగ్ కేసు

అది ఫేక్ న్యూస్ - శివ నిర్వాణ

అది ఫేక్ న్యూస్ – శివ నిర్వాణ

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

పక్షులకు హై వోల్టేజ్ వైర్లపై కూర్చున్నా ఎందుకు షాక్ కొట్టదో తెలుసా ?

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

థాంక్యూ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)