రవితేజా హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇడియట్. 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కన్నడం లో పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు కి రీమేక్ ఇది. ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి ఫాం లో ఉన్న పూరి ఈ సినిమాను ముందు కన్నడం లో డైరెక్ట్ చేసారు. రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఈ సినిమా కథ వినిపించగా… రాజ్ కుమార్ కి బాగా నచ్చింది.
Also Read:ఇతనే.. ఆర్సీబీకి కొత్త కెప్టెన్..!
దీన్ని ముందు పూరి తెలుగులో చేయాలనుకున్నాడు. కాని… పునీత్ రాజ్ కుమార్ ను లాంచ్ చేయడానికి ఎన్నో కథలు వింటున్నారు రాజ్ కుమార్. కాని మంచి కథలు దొరకకపోవడం పూరి చెప్పిన ఈ కథ బాగా నచ్చడం తో దాదాపు 2 గంటల పాటు కథ విని సినిమాను రాజ్ కుమార్ ఒకే చేసారు. ఆ తర్వాత అప్పు పేరుతో అక్కడ రక్షితను హీరోయిన్ గా తీసుకుని సినిమా చేసారు.
Also Read:టీపీసీసీ కార్యవర్గ సమావేశం
Advertisements
ఆ సినిమా పేరే పునీత్ రాజ్ కుమార్ కు నిక్ నేమ్ అయిపోయింది. అప్పటి వరకు పరిశ్రమలో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్నాథ్ కు ఈ సినిమా మంచి జోష్ ఇచ్చింది. ఇక వెంటనే ఈ సినిమాను తెలుగులో మహేష్ బాబు లేదా పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించాడు. అప్పటికే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కథ చెప్తే… తన ఇమేజ్ కు సరిపడదు అని వద్దన్నాడు.
ఇక మహేష్ బాబుకి చెప్తే వివిధ కారణాలతో రిజెక్ట్ చేసారు. కాని రవితేజా మాత్రం సినిమా కథ విని వెంటనే ఒకే చేసారు. కన్నడం లో సూపర్ హిట్ కావడంతో అవ్వడంతో మరో ఆలోచన లేకుండా ఒకే చేసాడు. రవితేజా బాడీ లాంగ్వేజ్ కూడా ఈ సినిమాకు బాగా సెట్ అయింది.