అంత్యక్రియల్లో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి చితి చుట్టూ కుండతో ప్రదక్షిణం చేయడం, కుండకు రంధ్రాలు చేయడం. ఇలా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. ఇలా చేయడం వెనుక పూర్వీకుల ముందుచూపు ఉంటుంది. చనిపోయిన వ్యక్తులు పిల్లలైనా, పెద్దలైనా సరే వాళ్ళను పితృదేవతలుగా భావిస్తారు. ప్రదక్షిణం చేయడం అంటే వారిని దేవతలుగా భావించి, భక్తి గౌరవాలు వెల్లడించడం.
Also Read:ఇంజెక్షన్ నరాలకు, శరీర అవయాలకు ఎందుకు చేస్తారు…?
స్మశానంలో మాత్రమే కాకుండా ఇంటివద్ద శవాన్ని తీసుకు వెళ్ళే ముందు, బంధువులు, సన్నిహితులు, అక్కడికి వచ్చినవారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అప్పుడు పూలుగానీ, పూలమాలలు గానీ వేసి భక్తి భావాలు ప్రదర్శిస్తారు. చితి చుట్టూ కుండతో ప్రదక్షిణ చేసి కుండకురంధ్రాలు చేసి, నీరు వదలడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. మన జీవితం కూడా చిల్లుల కుండ అనే తాత్విక సందేశం ఇస్తారు.
అలాగే దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది. మన శ్మశానాలు ఎక్కువగా చెత్తా చెదారంతో ఉండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరికొన్ని చోట్ల దట్టమైన పొదలు, చెట్లు ఉండటంతో మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల శ్మశానాల్లో గడ్డివాములు, పశువుల పాకలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే కపాల మోక్షం కలిగిన వెంటనే వచ్చిన వాళ్ళు ఇళ్ళకు వెళ్తారు. అప్పుడు మంటలు విస్తరిస్తే అగ్ని ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చితి చుట్టూ నీరు జల్లడంతో అగ్ని ప్రమాదం కట్టడి చేయవచ్చు. అందుకే పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగించారని అంటూ ఉంటారు.
Also Read:సువేందు అధికారిని అడ్డుకున్న పోలీసులు