డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ ఆరోపణలు తెలంగాణలో రాజకీయ వేడిని రేకెత్తిస్తన్నాయి. డ్రగ్స్ టెస్ట్ కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్… నేను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు వస్తాము, డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించే పరీక్షలకు మేం రెడీ.. మీరు రెడీయా అంటూ సవాల్ చేశారు. మధ్యాహ్నం 12గంటలకు వచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండని కోరారు.
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నేను చర్లపల్లి జైల్లో ఉన్న వారితో పోల్చుకోను. మీ రాహుల్ గాంధీ వస్తే ఢిల్లీ ఎయిమ్స్ లో పరీక్షలకు సిద్ధం. నేను డ్రగ్స్ తీసుకోనట్లు తేలితే… నువ్వు నీ పోస్ట్ నుండి తప్పుకుంటావా అని సవాల్ విసిరారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధపడతావా అని ప్రశ్నించారు.
I am ready for any test & will travel to AIIMS Delhi if Rahul Gandhi is willing to join. It’s below my dignity to do it with Cherlapally jail alumni
If I take the test & get a clean chit, will you apologise & quit your posts?
Are you ready for a lie detector test on #Note4Vote https://t.co/8WqLErrZ7u
— KTR (@KTRTRS) September 20, 2021
Advertisements
అయితే, మంత్రి కేటీఆర్ కు వచ్చే ఉద్దేశం లేకనే రాహుల్ ను తెరపైకి తెస్తున్నారని, ఇద్దరు రాష్ట్ర నేతల మధ్య వచ్చిన సవాళ్లకు… ప్రతి సవాళ్లకు రాహుల్ కు ఎందుకు లింకు పెడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డితో తలనొప్పి మొదలైందని టీఆర్ఎస్ భయపడుతుంది కాబట్టే అవకాశం వచ్చిన ప్రతిసారి మీ పోస్టుల నుండి తప్పుకుంటావా అని మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.