ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి ఇంటర్నేషనల్ ఫ్యాషన్లో షోలో తళుక్కుమన్నారు. న్యూయార్క్లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పడుకొనే, ఇషా అంబానీ వంటి వారు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు. తొలిసారి బీటౌన్ బ్యూటీలు కాకుండా సుధారెడ్డి ఈ వేదికపై మెరవడం విశేషం.
ఈ ఏడాది థీమ్ ‘అమెరికన్ ఇండిపెండెన్స్’కు తగ్గట్లుగా.. అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫాల్గుని, షేన్ పీకాక్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును సుధారెడ్డి ధరించారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. మెట్ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. అలాగే ఈఏడాది భారత్ నుంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం.