• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఇప్పుడైనా గుర్తిస్తారా..?

ఇప్పుడైనా గుర్తిస్తారా..?

Last Updated: January 17, 2023 at 5:24 pm

– రేపు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
– వంద ఎకరాల్లో సభా ఏర్పాట్లు
– జాతీయ మీడియా పక్కాగా కవర్ చేసేలా ప్లాన్
– రాష్ట్రానికొచ్చే నేతలతో పలు కార్యక్రమాలు
– ముందుగా ప్రగతి భవన్ లో భేటీ
– యాదాద్రి టూర్.. కలెక్టరేట్, కంటివెలుగు ప్రారంభోత్సవాలు
– రోజంతా మీడియాలో వచ్చేలా బిజీ షెడ్యూల్
– ఈసారి జాతీయ మీడియా కవరేజ్..
– జాతీయ నేతగా ప్రమోట్ పక్కానా?

జాతీయ రాజకీయాల లక్ష్యంతో మొదట రాష్ట్రాల టూర్లు పెట్టుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొందరు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిశారు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ప్రాంతీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చూశారు. కానీ, సరిగ్గా వర్కవుట్ కాలేదు. అనేక విమర్శలు, అవమానాలు, సవాళ్ల తర్వాత టీఆర్ఎస్ నే జాతీయ పార్టీగా ప్రకటించారు. కలిసివచ్చే పార్టీలను కలుపుకుంటూ పోవాలని రైతు రాజ్యం నినాదంతో రాజకీయం నడిపిస్తున్నారు. అయితే.. కేసీఆర్ ఢిల్లీ టూర్లు పెట్టుకున్నా.. హస్తినలోనే కేంద్రానికి వ్యతిరేకంగా పోరు సాగించినా.. వివిధ రాష్ట్రాల నేతలను కలిసినా.. జాతీయ మీడియా అంతగా ఫోకస్ పెట్టింది లేదు.

కేసీఆర్ ను ప్రాంతీయ పార్టీ నేతగానే చూస్తూ వస్తోంది జాతీయ మీడియా. కానీ, ఖమ్మం సభ తర్వాత సీన్ మారిపోతుందని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. మంత్రి హరీష్ రావు అయితే.. జాతీయ రాజకీయాల్లో ఇకపై బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషించనుందని నొక్కి మరీ చెబుతున్నారు. కాంగ్రెస్ రోజురోజుకీ బలహీన పడుతోందని ప్రత్యామ్నాయం వైపు ప్రజలు చూస్తున్నారని అంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే పాట పాడుతున్నారు. ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. దీనికోసం మూడు రాష్ట్రాల సీఎంలకు పలువురు జాతీయ నేతలకు ఆహ్వానం పంపారు కేసీఆర్.

దాదాపు 500 ఎకరాల్లో ఈ సభా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను వంద ఎకరాల్లో నిర్వహిస్తుండగా.. పార్కింగ్ కోసం 400 ఎకరాలకు పైగా వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ కి, తనకు జాతీయ ఇమేజ్ తెచ్చేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ సభ నిర్వహించడమే కాకుండా.. తన కోసం జాతీయ నేతలు తరలివచ్చారని మీడియా కంట్లో పడాలన్నదే ఆయన ప్లాన్ గా కనిపిస్తోందని అంటున్నారు. సభ కోసం ముగ్గురు సీఎంలు, ఇతర నేతలు వస్తున్నారంటే.. జాతీయ మీడియా పక్కాగా తెలంగాణ వైపు చూస్తుందనే ఉద్దేశంతో వారందరికీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని చెబుతున్నారు. రోజంతా బిజీగా ఉండేలా కేసీఆర్ షెడ్యూల్ ప్రిపేర్ చేశారని వివరిస్తున్నారు.

కేరళ సీఎం పనరయి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మాజీ సీఎం అఖిలేష్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాలను బుధవారం వివిధ కార్యక్రమాలలో భాగస్వాములను చేశారు కేసీఆర్. ముందుగా ఉదయం ప్రగతి భవన్‌‌‌‌ లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తో వీరంతా సమావేశం అవుతారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించి.. బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్తారు. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటారు. అటునుంచి ఖమ్మం వెళ్లి కొత్త కలెక్టరేట్‌ ‌‌‌ను ప్రారంభిస్తారు. నలుగురు ముఖ్యమంత్రులు, అఖిలేశ్, రాజా చేతులమీదుగా కంటివెలుగు రెండో విడతకు శ్రీకారం చుడతారు. లంచ్ తర్వాత బహిరంగ సభకు హాజరవుతారు. ఇలా జాతీయ నేతలను బీఆర్ఎస్ కార్యక్రమానికి పిలిచి.. మీడియా అటెన్షన్ అంతా తనవైపు ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేశారని అంటున్నారు విశ్లేషకులు. ఈసారి జాతీయ మీడియా కచ్చితంగా ప్రాధాన్యం ఇచ్చేలా.. తనను జాతీయ నేతగా గుర్తించేలా వ్యూహం రచించారని చెబుతున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు.. హిమాన్షుపై ప్రశంసలు..!

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap