కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే టీఆర్ ఎస్ ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తుకొస్తాయని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ ఎస్ కోసం కాంగ్రెస్ పని చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ఏకంగా మంత్రులు మునుగోడులో మకాం వేసి మరి ఓటర్లకు విందు, మందు, డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. ట్విట్లర్ వేదికగా చేసుకొని కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏది పడితే అది చెబుతున్నాడని విమర్శించారు. కచ్చితంగా రాష్ట్రంలో బుల్డోజర్ సర్కార్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాకముందు ఇంటికొక ఉద్యోగమన్న కేసీఆర్.. వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.. మునుగోడు ఎన్నిక కోసం గిరిజన బంధు తీసుకొచ్చారని.. బీసీలకు బీసీ బంధు ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు.
సూరత్ నుంచి నాసిరకం బతుకమ్మ చీరలు తెచ్చి నేతన్నల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని.. మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.