తమిళనాడు మాజీ సీఎం జయలలిత అంతరంగికురాలు శశికళ… తిరిగి సొంతగూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం కీలక ప్రకటన చేశారు. శశికళ తిరిగి అన్నాడీఎంకేలో వస్తానన్న ప్రతిపాదనలు వస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తామని పేర్కొన్నారు.
అన్నాడీఎంకే వ్యక్తులపైన గానీ, కుటుంబాలపైన గానీ ఆధారపడదని చెబుతూనే… శశికళపై తనకు ఎలాంటి కోపమూ లేదని, నిరాశ కూడా లేదని పేర్కొన్నారు. శశికళ అన్నా, టీవీవీ దినకరన్ అన్నా తానెంతో గౌరవిస్తానని స్నేహ హస్తం చాచారు. తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటే తన ఇష్టమని, ఆ నిర్ణయం ఆమె మాత్రమే తీసుకోవాలని అన్నారు.
తనకు, సీఎం పళని స్వామికి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని… పళని స్వామే సీఎం అభ్యర్థిగా ఉండాలని ప్రతిపాదించిన వారిలో తానూ ఒకరినని పన్నీరు సెల్వం కామెంట్ చేశారు. రాజకీయాల్లో రాజీలు పడటం సహజం. అందుకు సిద్ధంగా ఉండాలి కూడా. తానే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారన్నారు.
పన్నీరు సెల్వం తాజా ప్రకటన చూస్తుంటే… శశికళ సొంతగూటికి రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.