మోడీ ప్రభుత్వంలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందే రికార్డు స్థాయిలో ధరల పెరిగాయని.. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందని అన్నారు.
ముడి చమురు ధరలు బ్యారెల్ కు 100 డాలర్లకుపైగా పెరగడంతో.. ఆహార ధరలు 22శాతం పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరఫరా చైన్ కు కొవిడ్ అంతరాయం కలిగించిందన్నారు. భారత ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని ప్రజలను రక్షించాలని ట్వీట్ చేశారు.
గత శనివారం ద్రవ్యోల్బణం, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్లపై వడ్డీ రేటును తగ్గించింది.ఈ నేపథ్యంలో కేంద్రంపై రాహుల్ ఫైర్ అయ్యారు. కేంద్రం తప్పుడు విధానాల పరిణామాలను సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఎఫ్డీ 5.1శాతం, పీపీఎఫ్ 7.1శాతం, ఈపీఎఫ్ 8.1శాతం.. రిటైల్ ద్రవ్యోల్బణం 6.07శాతం తగ్గించారని పేర్కొన్నారు. టోకు ద్రవ్యోల్బణం 13.11శాతం పెరిగిందన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించడం ప్రభుత్వ బాధ్యత కాదా..? అంటూ మండిపడ్డారు రాహుల్.