కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎయిర్ బెలూన్ తెరుచుకోవటంతో ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్రదర్ అనిల్ కుమార్ కారు ప్రమాదానికి గురైందని తెలుసుకొని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కారులో హుటాహుటిన సంఘటన స్థలానికిచేరుకున్నారు. దాంతో ఆయన బ్రదర్ అనిల్ కుమార్ తోపాటు అతని డైవర్ ,గన్ మెన్ లను విజయవాడలోనే ఎం జె. నాయుడు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ కుమార్ అక్కడి నుంచి బయల్దేరారు. యేసు ప్రభువు కృప వల్లే బ్రదర్ అనిల్ కుమార్ ఎటువంటి ప్రమాదానికి గురి కెలదన్నారు సామినేని ఉదయభాను.