ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలను తనకు చెప్పకుండా ప్రజలకు పంచాడని చితక్కొట్టాడు ఓ వైసీపీ నాయకుడు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా నవలాకుల గార్డెన్స్ లో ఒకటో డివిజన్ వాలంటీర్ మహేష్ ను దారుణంగా కొట్టారు. ఆ డివిజన్ కు చెందిన ఓ వైసీపీ నాయకుడు తాను చెప్పినట్లు చేయడం లేదని, తనకు చెప్పకుండా ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయలను పేదలకు పంచాడని ఈ దారుణానికి ఒడిగట్టాడు. దళితుడైన ఈ వాలంటీర్ ను గదిలో బంధించి కొంతమంది వ్యక్తులతో కలిసి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయమై వాలంటీర్లు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వటం తాను చేసిన తప్ప అంటూ ఆవేదన వవ్యక్తం చేస్తున్నారు వాలంటీర్స్. దీనిపైనా అధికారులు స్పందించి న్యాయం చెయ్యాలని కోరాడు.