సీనియర్ ఐఏఎస్, సీఎం కార్యాలయం కార్యదర్శి అధికారిణి స్మితా సబర్వాల్ నిజామాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతితో కలిసి గర్భిణీలతో ఆమె ముఖాముఖి అయ్యారు. భిక్కనూర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. అయితే కార్యక్రమం కొనసాగుతుండగా ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి.
గర్భిణీలతో మాట్లాడుతూ స్మితా సబర్వాల్.. ప్రతి మహిళకు అమ్మ అవ్వడం అనేది ఒక వరం అన్నారు. న్యూట్రిషన్ కిట్లను ఏవిధంగా వాడుతున్నారని వారిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో వాళ్లకు వివరించారు ఆమె. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
తన వయస్సు మీకంటే డబుల్ ఉంటుందని.. తనకు 18 ఏళ్ళ కొడుకున్నాడని.. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్లే ఇంత ఆరోగ్యంగా ఉన్నట్లు గర్భిణీలకు వివరించారు. అదే టైమ్ లో మీరు బాగున్నారని ఒక మహిళ అనడంతో సమావేశంలో నవ్వులు విరబూశాయి. కాంప్లిమెంట్ కు థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు స్మిత సబర్వాల్.