కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. అయితే థియేటర్లు తెరచుకున్నప్పటికి ప్రేక్షకులు వస్తారా రారా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో సాయిధరమ్ తేజ్, నిఖిల్ థియేటర్ కు వెళ్లి సినిమా చూడటమే కాకుండా ప్రేక్షకులకు ఆహ్వానం పలికారు. థియేటర్స్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరు మాస్క్ ధరిస్తే చాలు.
హాయిగా సినిమా చూసి ఇంటికి వెళ్ళవచ్చు అని చెబుతూ సాయి తేజ్ ఓ వీడియో ని పోస్ట్ చేశారు. పుల్లారెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి థియేటర్ లో అడుగు పెట్టే వరకు థియేటర్ వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరిస్తూ ప్రేక్షకులకు ధైర్యం చెప్పేలా ఈ వీడియోని సాయిధరమ్ తేజ్ రూపొందించారు. మరోవైపు బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తున్నానని మూవీ థియేటర్ లో ఉన్న ఓ పిక్ ని షేర్ చేశారు నిఖిల్. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించటానికి ఈ యంగ్ హీరోలు చేసిన ప్రయత్నాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
It feels good to be back at the theater after a long long time. Watching a movie on the big screen is the ultimate form of entertainment for me. I know many of you feel the same. Let's celebrate cinema again in it's finest form from today. #CelebratingCinema pic.twitter.com/hUylnVhYO6
— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2020
Back to Theatres after soooooo long… TENET looked awesome on the BIG SCREEN… Happy to see A Full House at @amb_cinemas pic.twitter.com/4cu2BYJT0E
— Nikhil Siddhartha (@actor_Nikhil) December 4, 2020