యథా లీడర్ తథా కేడర్ అనేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. అక్కడ కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే ప్రజలను గాలికొదిలి ఫాంహౌజ్ లో బోగాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు.
జనం దయతలిస్తే గెలిచామన్న ఇంగితం కూడా లేదని.. పోడు పట్టాలు, 3ఎకరాల భూమి, రుణమాఫీ, నష్టపరిహారం, పంటబీమా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, యంత్ర లక్ష్మి ఇవన్నీ బంద్ పెట్టి, కేవలం 5వేలు ఇచ్చి రైతులు కోటీశ్వరులయ్యారని డబ్బా కొట్టుకుంటున్నారని ఫైరయ్యారు. 60 ఏండ్లు దాటినోళ్లకు రైతుబీమా ఇయ్యరు కానీ ఈయన 68ఏండ్లున్నా సీఎం పదవిలో ఉండొచ్చట.. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు.
6 నెలల కిందట మిర్చి రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి, రూపాయి ఇవ్వలేదని.. రైతులు ఎలా బతుకుతున్నారన్న సోయి కూడా కేసీఆర్ లేదని మండిపడ్డారు. రెండుసార్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఏం చేసిందని నిలదీశారు షర్మిల.
Advertisements
ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేలంతా ఆస్తులు సంపాదించుకోవడం, ఫాంహౌజ్ లో బోగాలు అనుభవించడం తప్ప ప్రజలకు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.