వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాను అన్నారు వైఎస్ సునీతారెడ్డి. తన తండ్రి హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడారని.. కడప, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదమ్మా అన్నట్లు చెప్పుకొచ్చారు. వివేకా వర్ధంతి సందర్భంగా సునీతారెడ్డి నివాళులు అర్పించారు.
వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతాను అన్నారు. 30 ఏళ్ల కిందటి గోడవలు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుందని.. తప్పుచేసిన వారికి తప్పక శిక్ష పడాలి అన్నారు. విచారణ సందర్భంగా మాట్లాడటం సరికాదని.. దర్యాప్తు సంస్థలు, పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలన్నారు. ఎంతోమంది తెలియకుండానే సహకరిస్తున్నారు.. వారికి కృతజ్ఞతలు తెలిపారు.
తన తండ్రిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు సునీత. ఈ కేసులో నిజాలు ఖచ్చితంగా బయటికి రావాలని.. కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించానని తెలిపారు. కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని కూడా తెలుసని.. ఈ హత్య కేసులో ప్రయేయం ఉందని నమ్ముతున్నందునే వారిపై సీబీఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాను అన్నారు. తన తండ్రి హత్య కేసులో నిజం తెలియాలనే పోరాటం చేస్తున్నాను అన్నారు.
తనకు తెలిసిన విషయాలను ఏనాడూ దాచలేదని.. తమకు తెలిసిన విషయాలను దర్యాప్తు సంస్థలకు చెప్పకపోవడం కూడా తప్పేనన్నారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును ఎవరూ ప్రభావితం చేయొద్దన్నారు. తన పోరాటం ఎవరి మీద కక్షతో చేస్తున్నది కాదని గమనించాలని.. తప్పు చేసినవారికి శిక్షపడితేనే ఇలాంటివి జరగవన్నారు. దర్యాప్తు సంస్థల గురించి కామెంట్ చేయొద్దన్నారు.