తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ఉదయం పదిన్నర తర్వాత నుంచి ఆయన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర కమిటీ మూడు రోజుల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏ టైమ్ కు ఎక్కడ ఉంటారు.. ఎంత దూరం నడుస్తారో వివరాలు వెల్లడించింది.
యువగళం పాదయాత్ర షెడ్యూల్
27-1-2023 (శుక్రవారం, 1వ రోజు 8.5 కిలోమీటర్లు)
10-30 AM – కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి చేరుకుని పూజలు
11.03 AM – పూజ అనంతరం గుడి ఆవరణలో పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుని పాదయాత్రకు శ్రీకారం
11.30 AM – సమీపంలోని మసీదులో ప్రార్థనలు
11.55 AM – హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు
12.45 PM – డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
1.05 PM – కుప్పం బస్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
1.25 PM – కొత్త బస్ స్టేషన్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు
3.00 PM – హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో బహిరంగసభ
4.30 PM – ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి, శెట్టిపల్లి, బెగ్గిలపల్లి
6.45 PM – పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ కు చేరిక, విరామం
28-1-2023 (శనివారం, 2వ రోజు 9.3 కిలోమీటర్లు)
8.00 AM – కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం
9.15 AM – బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటామంతీ
11.05 AM – కడపల్లిలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
1.30 PM – కలమలదొడ్డిలో భోజన విరామం – పార్టీ సీనియర్ నేతలతో సమావేశం
3.30 PM – కలమలదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – శాంతిపురం క్యాంప్ సైట్ కు చేరిక – ప్రముఖులతో సమావేశం
6.45 PM – శాంతిపురంలో బస
29-1-2023 (ఆదివారం, 3వ రోజు 11 కిలోమీటర్లు)
8.00 AM – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి యాత్ర ప్రారంభం
8.45 AM – ప్రముఖులతో సమావేశం
9.45 AM – బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
12.15 PM – కె.గెట్టపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ
12.45 PM – కె.గెట్టపల్లిలో భోజన విరామం
3.00 PM – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ కు చేరిక, ప్రముఖులతో సమావేశం
5.55 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ లో బస